భారత్‌లో ఒక్కరోజులో రికార్డ్ స్థాయిలో కరోనా కేసులు

భారత్‌లో కరోనా కేసులు రోజురోజుకి పెరుగుతున్నాయి. రోజుకి 25 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో 26,506 మందికి కరోనా పాజిటివ్ గా తేలింది. ఇప్పటివరకు ఒక్కరోజులో నమోదైన అత్యధిక కేసులు ఇవే. అదే సమయంలో 475 మంది కరోనా కారణంగా మరణించారు. దేశంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 7,93,802కి చేరగా, మృతుల సంఖ్య మొత్తం 21,604కి చేరింది. ప్రస్తుతం 2,76,685 యాక్టివ్ కేసులు ఉన్నాయి.