ఏపీలో లక్షన్నర దాటిన కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్‌ లో కరోనా పాజిటివ్ కేసులు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 60,797 మందికి పరీక్షలు నిర్వహించగా.. 9276 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. అదే సమయంలో 58 మంది కరోనాతో మృత్యువాత పడ్డారు. అయితే ఊరట కలిగించేలా, ఒక్కరోజులోనే 12,750 మంది డిశ్చార్జి అయ్యారు. ఏపీలో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 1,50,209కి చేరగా.. మృతుల సంఖ్య 1407కి చేరింది. ఇప్పటివరకు 76,614 మంది కరోనా నుంచి కోలుకోగా.. ప్రస్తుతం 72,188 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక ఏపీలో ఇప్పటివరకు నిర్వహించిన మొత్తం పరీక్షల సంఖ్య 20,12,573కి చేరింది.