ఏపీలో ఒక్కరోజే 2,412 కరోనా కేసులు

ఏపీలో కరోనా విజృంభిస్తోంది. గడచిన 24 గంటల్లో ఏకంగా 2,412 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. ఏపీలో ఒక్కరోజే ఇంత పెద్ద సంఖ్యలో కరోనా కేసులు నమోదు కావడం ఇదే ప్రథమం. గడచిన 24 గంటల్లో నమోదైన కేసుల్లో.. ఒక్క గుంటూరు జిల్లాలోనే అత్యధికంగా 468 నమోదు కావడం గమనార్హం. గుంటూరు తర్వాత ఆ స్థాయిలో కర్నూలు జిల్లాలో 403 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొత్త కేసులతో కలిపి ఏపీలో ఇప్పటికవరకు నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 35,451 కి చేరింది. గడచిన 24 గంటల్లో ఏపీలో 44 మంది కరోనా వల్ల మరణించారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 452 కి చేరింది. ప్రస్తుతం ఏపీలో 16,621 యాక్టివ్ కేసులు ఉన్నాయి.