ఏపీలో కరోనా ఉగ్రరూపం.. ఒకే రోజు రికార్డ్ సంఖ్యలో కేసులు

ఏపీలో కరోనా తీవ్ర రూపం దాలుస్తోంది. నిన్న ఒక్క రోజే 1933 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నిన్న మొత్తం 17,624 శాంపిల్స్ పరీక్షించగా రికార్డ్ స్థాయిలో 1933 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. అంతే కాకుండా నిన్న 19 మంది మృత్యువాత పడ్డారు. దీనితో మృతుల సంఖ్య 328 కి చేరుకుంది. నిన్న నమోదైన కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 29,168 కి చేరింది. ఐతే వీరిలో 15,412 మంది కోలుకోగా ప్రస్తుతం 13,428 యాక్టివ్ కేసులు ఉన్నాయి. వీరిలో కొంత మంది ఇంటి వద్దే చికిత్స తీసుకుంటూ ఉండగా ఎక్కువ మంది వివిధ హాస్పిటల్స్ లో చికిత్స తీసుకుంటున్నట్లు సమాచారం.