ఏపీలో మరో 48 కరోనా పాజిటివ్ కేసులు

ఏపీలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. కరోనా కేసుల తాజా బులెటిన్‌ను వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసింది. ఏపీలో గత 24 గంటల్లో 9,628 శాంపిల్స్‌ని పరీక్షించగా 48 మంది మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. 101 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,205గా ఉందని తెలిపింది. ప్రస్తుతం ఆసుపత్రుల్లో 803 మంది చికిత్స పొందుతుండగా, 1353 మంది డిశ్చార్జ్ అయ్యారు. కరోనాతో గత 24 గంటల్లో మరొకరు మృతి చెందారు. దీంతో ఇప్పటివరకు ఏపీలో కరొనతో మృతి చెందిన వారి సంఖ్య 49కి చేరింది.

రాష్ట్రంలో కొత్తగా నమోదైన పాజిటివ్ కేసులలో కర్నూల్‌లో 9, నెల్లూరులో 9, చిత్తూర్‌లో 8, విశాఖలో 4, కృష్ణా 7, గుంటూరు 9, కడప జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఒక్కొక్క కేసు నమోదయ్యాయని వైద్య, ఆరోగ్య శాఖ బులెటిన్‌లో తెలిపింది.