భారత్ లో 4 వేలు దాటిన కరోనా మరణాలు

భారత్‌లో కరోనా కేసులు రోజురోజుకి పెరుగుతూనే ఉన్నాయి. రోజుకి 6 వేల మార్కుని దాటుతున్న కరోనా కేసులు.. 7 వేల మార్కుని కూడా దాటేలా ఉన్నాయి. గత 24 గంటల్లో దేశంలో 6,977 మందికి కరోనా పాజిటివ్ గా తేలిందని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటివరకు ఒక్క రోజులో నమోదైన అత్యధిక కేసులు ఇవే. అదే సమయంలో 154 మంది కరోనా బారినపడి ప్రాణాలు కోల్పోయారు. దీంతో, దేశంలో కరోనా మృతుల సంఖ్య 4,021కి చేరింది. ఇక దేశంలో  ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య మొత్తం 1,38,845కి చేరింది. కరోనా నుంచి ఇప్పటిరవకు 57,720 మంది కోలుకోగా, ప్రస్తుతం 77,103 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.