ఏపీలో కరోనాతో మరో 67 మంది మృతి

ఆంధ్రప్రదేశ్ లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. ప్రతిరోజూ భారీ సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో 74,710 మందికి టెస్టులు నిర్వహించగా.. 8,096 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన కేసుల సంఖ్య 6,09,558కి చేరింది. ఇక గడిచిన 24 గంటల్లో ఏపీలో 67 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఏపీలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 5,244కి చేరింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 5,19,891 కరోనా నుంచి కోలుకోగా.. ప్రస్తుతం 84,423 యాక్టివ్ కేసులు ఉన్నాయి.