కొనసాగుతున్న కరోనా ఉధృతి.. ఏపీలో 54.. భారత్ లో 6,566

ఏపీ‌లో కరోనా ఉధృతి తగ్గట్లేదు. ప్రతిరోజూ 50 కి పైగా కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో 9,858 శాంపిల్స్ ను పరీక్షించగా 54 మందికి కరోనా పాజిటివ్ గా తేలిందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. అదే సమయంలో 45 మంది డిశ్చార్జ్‌ అయ్యారని తెలిపింది. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,841కు చేరుకుంది. కాగా, గత 24 గంటల్లో కర్నూల్ లో ఒకరు కరొనతో చనిపోయారు. దీంతో ఏపీలో కరోనా మృతుల సంఖ్య మొత్తం 59కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 1,958 మంది డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం ఆసుపత్రుల్లో 824 మంది చికిత్స  పొందుతున్నారు.

ఇక దేశవ్యాప్తంగా రోజుకి ఆరు వేలకు పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో దేశంలో 6,566 మందికి కరోనా పాజిటివ్ గా తేలింది. దీంతో దేశంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,58,333కి చేరింది.  గత 24 గంటల్లో 194 మంది మరణించగా, మొత్తం మృతుల సంఖ్య 4,531 చేరుకుంది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 67692 మంది కోలుకోగా, ప్రస్తుతం 86,110 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది.