ఏపీలో కొత్తగా 47 కరోనా కేసులు.. ఒకరు మృతి

ఆంధ్రప్రదేశ్‌ లోని కరోనా కేసుల తాజా బులెటిన్‌ను రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసింది. గత 24 గంటల్లో 9,136 శాంపిల్స్‌ ని పరీక్షించగా 47 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. అదే సమయంలో 47 మంది కరోనా నుంచి కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయ్యారు. కరోనా వల్ల గత 24 గంటల్లో కృష్ణాజిల్లాలో మరొకరు ప్రాణాలు కోల్పోయారు. కాగా, రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2561 కి చేరింది. మృతుల సంఖ్య 56కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 1778 మంది డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం ఆసుపత్రుల్లో 727 మంది చికిత్స పొందుతున్నారు.