ఏపీలో కొత్తగా 10,175 కరోనా కేసులు

ఏపీలో కరోనా మహమ్మారి విలయ తాండవం కొనసాగుతోంది. రోజుకి పది వేలకు పైగా కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. ఏపీలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 10,175 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో కరోనాతో 68 మంది మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 5,37,687కి చేరగా, మరణాల సంఖ్య 4,702కు చేరింది. ఇప్పటివరకు 435647 మంది కరోనా నుంచి కోలుకోగా.. ప్రస్తుతం ఏపీలో 97,338 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో 43.80 కరోనా పరీక్షలు నిర్వహించారు.