ఏపీలో వరుసగా మూడో రోజు పది వేలకు పైగా కేసులు

ఏపీలో వరుసగా మూడో రోజు పది వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. గడచిన 24 గంటల్లో 61,699 శాంపిల్స్ ని పరీక్షించగా.. 10,376 మందికి కరోనా పాజిటివ్ గా తేలింది. అదే సమయంలో 68 మంది కరోనాతో మృత్యువాత పడ్డారు. ఏపీలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,40,933 కి చేరగా.. కరోనా మృతుల సంఖ్య 1,349 కి చేరింది. ఇప్పటివరకు 63,864 మంది కరోనా నుంచి కోలుకోగా.. ప్రస్తుతం 75,720 యాక్టివ్ కేసులు ఉన్నాయి.