ఏపీలో మత విద్వేషాలు రెచ్చగొట్టేందుకు కుట్ర.. నటుడు నరేష్.!
Published on: Tue Jul 7, 2026 11:13AM
.webp)
రాష్ట్రంలో శాంతిని దెబ్బతీసి, మత విద్దేషాలు రెచ్చగొట్టేందుకు కొన్ని శక్తులు ఉద్దేశ పూర్వకంగా కుట్ర పన్నుతున్నాయా అంటే సీనియర్ నటుడు నరేష్ ఔననే అంటున్నారు. ఆయన తాజాగా సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ లో చేసిన ఒక పోస్టు సంచలనంగా మారింది. ఆయన ఎక్స్ వేదికగా ఆంధ్రప్రదేశ్లో సమాజ శాంతిని దెబ్బతీసేలా, మతపరమైన విద్వేషాలను రెచ్చగొట్టేందుకు కొన్ని శక్తులు ఉద్దేశపూర్వకంగా కుట్రలు పన్నుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో ఇటువంటి పోకడలు ఏ మాత్రం మంచివి కావన్నారు.
ఆ ట్వీట్ లో నటుడు నరేష్ ఏపీలోని ప్రస్తుత పరిస్థితులను ప్రస్తావిస్తూ.. రాష్ట్ర ప్రగతికి ఇటువంటి మత రాజకీయాలు అవరోధంగా మారుతాయన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజల మధ్య చిచ్చు పెట్టడం సమంజసం కాదని, సమాజాన్ని మత విద్వేషాలతో అపవిత్రం చేయవద్దని పిలుపునిచ్చారు. ఒక సీనియర్ నటుడిగా, సమాజం పట్ల బాధ్యత కలిగిన పౌరుడిగా తాను ఈ విషయాలపై స్పందించానని పేర్కొన్న నటుడు నరేష్.. ఏపీలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా సాగుతున్న ఈ ప్రచారాల వెనుక ఉన్న అసలు శక్తులను ప్రజలు గుర్తించాలన్నారు.
దళిత, క్రైస్తవ వర్గాలను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న ఈ మత రాజకీయాల వెనుక ఓట్ల వ్యూహాలు దాగి ఉన్నాయనీ, కులాల విభజనతో సరిపెట్టకుండా.. ఓట్ల వేట కోసం మతాలను కూడా రాజకీయాల్లోకి లాగడం సరికాదంటూ నటుడు నరేష్ చేసిన ఈ ట్వీట్ను నెటిజన్లు సమర్థిస్తున్నారు.
Actor Naresh Tweet, AP Religious Politics, Andhra Pradesh Political News, Naresh Sensational Comments


