మా ఎమ్మెల్సీలపై వేటు వేయండి: కాంగ్రెస్

 

రంగారెడ్డి జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌ ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌ ఛైర్మన్‌ అభ్యర్థికి మద్దతుగా ఓటు వేసిన కుత్బుల్లాపూర్‌ జడ్పీటీసీ, ఎమ్మెల్సీ యాదవరెడ్డిని పార్టీ నుంచి ఆరేళ్లపాటు బహిష్కరిస్తూ టి పిసిసి నాయకత్వం నిర్ణయం తీసుకొంది. అలాగే మండలి ఛైర్మన్‌ ఎన్నికల్లో పార్టీ విప్ ధిక్కరించిన కాంగ్రెస్‌ ఎమ్మెల్సీలపై వేటు వేయాలని మండలి ఛైర్మన్‌ స్వామీగౌడ్‌కు శాసనమండలి కాంగ్రెస్‌ పక్ష నేత డి.శ్రీనివాస్‌ తన సహచర ఎమ్మెల్సీలతో కలసి ఫిర్యాదు చేశారు. ఇలా పార్టీలో ధిక్కార స్వర నేతలపై కఠిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్‌ నాయకత్వం భావిస్తోంది. పార్టీ హైకమాండ్‌ ఆదేశం మేరకే ఎమ్మెల్సీలపై అనర్హత వేటుకు టి కాంగ్రెస్‌నాయకత్వం చర్యలు తీసుకొన్నట్లు తెలిసింది.