కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్దులు వీరే..


రాజ్యసభలో మొత్తం 57 సభ్యులకు పదవీకాలం ముగియడంతో ఖాళీలు ఏర్పడనున్న సంగతి తెలిసిందే. ఈ 57 స్థానాల్లో రెండు స్థానాలు తెలంగాణకు, నాలుగు స్థానాలు ఏపీకి వచ్చాయి. ఇప్పటికే తెలంగాణకు సంబంధించిన అభ్యర్ధులు ఖరారైపోయారు. ఇక ఏపీనుండి మూడు స్థానాలు టీడీపీకి, వైసీపీ ఒక స్థానం దక్కనున్నట్టు తెలుస్తోంది. అయితే అభ్యర్ధులు ఇంకా తెలియాల్సి ఉంది. ఇక కాంగ్రెస్ పార్టీ కూడా రాజ్యసభకు తమ అభ్యర్థులుగా కాంగ్రెస్‌ పార్టీ ఆరుగురి పేర్లను ప్రకటించింది. పి. చిదంబరం, ఆస్కార్‌ ఫెర్నాండెజ్‌, జైరాం రమేశ్‌, అంబికా సోనీ, వివేక్‌ టంకా, కపిల్‌ సిబాల్‌, ఛాయావర్మలను తమ పార్టీ తరఫున రాజ్యసభకు అభ్యర్థులుగా కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించింది.