అనంత కాంగ్రెస్ లో అయోమయం
Published on: Sat Apr 21, 2012 10:31AM
అనంతపురం శాసనసభ నియోజకవర్గానికి జరిగే ఉప ఎన్నికల్లో ఎవరిని బరిలోకి దింపాలనే విషయంపై కాంగ్రెస్ పార్టీలో తీవ్ర అయోమయ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ టిక్కెట్టు కోసం రషీద్ అహ్మద్, రాగే పరుశురామ్, మల్లిఖార్జున, విజయభాస్కరరెడ్డి, రాజశేఖరరెడ్డి తదితరులు ప్రయత్నిస్తున్నారు. అయితే వీరికి అర్తబలంతో పాటు అంగబలం కూడా లేకపోవడంతో టిక్కెట్టు ఎవరికీ ఇవ్వాలనే విషయంపై అధిస్థానం ఆలోచనలో పడింది. నిజానికి అనంతపురం జిల్లా ఎంపి అనంతవెంకటరామిరెడ్డి కుటుంబంలో ఒకరికి టిక్కెట్టు ఇస్తే బాగుంటుందని అధిష్టానం యోచిస్తోంది. అయితే అనంతరామిరెడ్డి కుటుంబసభ్యులు ఎవరూ ఎన్నికల్లో పోటీచేయడానికి ఇప్పటి దాకా బహిరంగంగా సుముఖత వ్యక్తం చేయలేడు. అందువల్ల అనంతవెంకట రామిరెడ్డి సిఫార్సు చేసిన వ్యక్తికీ టిక్కెట్టు ఇవ్వాలని కాంగ్రెస్ అధిస్థానం భావించింది. కానీ, దీనికి కూడా అనంతవెంటక రామిరెడ్డి ముందుకు రావటం లేదు. తాను ఎవరి పేరునైనా సిఫార్సు చేస్తే అతన్ని గెలిపించుకోవాల్సిన భారంతో పాటు ఖర్చంతా తన నెత్తిమీద పడుతుందని ఆయన భయపడుతున్నట్లు తెలుస్తోంది. మరీ అర్థబలం, అంగబలం లేని అనామకులకు టిక్కెట్టు ఇస్తే ఎన్నికల్లో డిపాజిట్లు కూడా దక్కకపోతే పార్టీ పరువుపోతుందని పార్టీ భావిస్తోంది.


