రెడీగా ఉండు జానారెడ్డి.. నేను మర్చిపోలేదు కేసీఆర్


రాజకీయాల్లో గెలపు, ఓటములు సహజమని కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి వ్యాఖ్యానించారు. మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయన పైవిధంగా స్పందించారు. గెలిచామని విర్రవీగిపోవడం.. ఓడిపోయామని కుంగిపోవడం కాంగ్రెస్ పార్టీకి తెలియదు అని అన్నారు. అంతేకాదు కాంగ్రెస్ నేతలు చేసిన ప్రచారాన్ని ఓటర్లు నమ్మలేదని తమ పార్టీ తీరునే విమర్శించుకున్నారు. త్వరలో తమ సత్తా చూపుతామని అన్నారు. ఈ సందర్బంగా ఆయన గతంలో చేసిన వాగ్ధానం గురించి కూడా ప్రస్తావించారు. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ప్రస్తావించారు. రానున్న మూడు సంవత్సరాలలో తెలంగాణ ప్రజలకు రెండో పంటకు నీరు అందిస్తే తాను గులాబీ కండువా కప్పుకుంటానని జానా గతంలో సవాల్ విసిరారు. అదే సవాల్ ను కేసీఆర్ వరంగల్ ఉపఎన్నిక గెలిచిన నేపథ్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కూడా గుర్తుచేశారు.. గులాబీ కండువా కప్పుకోవడానికి జానా సిద్దంగా ఉండాలని అన్నారు. దీనికి జానా స్పందించి తను చేసిన వాగ్ధానాన్ని మరిచిపోలేదని.. తన ఇచ్చిన హామీని కనుక నెరవేర్చినట్టయితే తాను తన పార్టీ ప్రచార సారథిగా ఉంటానని మళ్లీ వాగ్ధానం చేశారు. మరి మూడేళ్లలో ఏం జరుగుతుందో చూడాలి.