తెలంగాణ భవన్ వద్ద కాంగ్రెస్ కార్తల ధర్నా
Published on: Mon Sep 30, 2024 3:42PM
తెలంగాణ భవన్ వద్ద కాంగ్రెస్ కార్యకర్తలు ధర్నా చేపట్టారు. మంత్రి కొండాసురేఖ మీద అసభ్యకర పోస్టులను బిఆర్ఎస్ సోషల్ మీడియా విడుదల చేసిందని కాంగ్రెస్ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. కెసిఆర్ దిష్టిబొమ్మను కాంగ్రెస్ కార్యకర్తలు దగ్దం చేసే ప్రయత్నం చేయగా బిఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఇరు పార్టీల కార్యకర్తలు ఘర్షణ పడటంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఉద్రిక్త పరిస్థితులను అడ్డుకోవడానికి పోలీసులు జోక్యం చేసుకోవల్సి వచ్చింది. తనపై బిఆర్ఎస్ ట్రోలింగ్ చేస్తుందని మంత్రి కొండా సురేఖ మీడియా సమావేశంలో ఆవేదన వ్యక్తం చేశారు. కెటీఆర్ ఖబడ్దార్ అంటూ ఆమె వార్నింగ్ ఇచ్చారు. మీడియా సమావేశంలో కొండా సురేఖ కంటతడి పెట్టారు. కెటీఆర్ కు మహిళలంటే చులకన భావమన్నారు.


