టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే వేధిస్తున్నారంటూ హెచ్ఆర్సీ లో ఫిర్యాదు చేసిన మహిళ 

మిర్యాలగూడ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు తాజాగా ఓ వివాదంలో చిక్కుకున్నారు. ఎమ్మెల్యే భాస్కర్‌రావు తన కుటుంబాన్ని వేదిస్తున్నాడని మణెమ్మ అనే మహిళ హైదరాబాద్ లోని రాష్ట్ర మానవహక్కుల కమీషన్ (హెచ్ఆర్సీ)‌ కి ఫిర్యాదు చేసారు. తమ కుటుంబం పై అక్రమ కేసులు బనాయించి ఎమ్మెల్యే భాస్కరరావు వేధిస్తున్నారని మణెమ్మ ఆరోపించారు. మిర్యాలగూడలో కొందరు భూకబ్జాదారులు చెలరేగిపోతున్నారని వారికి ఎమ్మెల్యే అండగా ఉన్నారని ఆమె అన్నారు. తన భర్త లాయర్ అని, అయన ఎమ్మెల్యే బాధితుల తరపున వాదిస్తున్నారని ఆమె తెలిపారు. అయితే భుకబ్జ్దారులకు వ్యతిరేకంగా.. బాధితులకు అండగా ఉన్నందుకు తన భర్తపై కక్ష గట్టి.. అక్రమ కేసులు పెడుతున్నారని ఆమె వాపోయారు. అంతేకాకుండా భాస్కర్ రావు అక్రమాలను ప్రశ్నించినందుకు తన భర్త, కుమారుడు, ఇతర కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆమె ఆరోపించారు. ఎమ్మెల్యే.. అయన అనుచరుల నుండి తమ కుటుంబానికి రక్షణ కల్పించాలని హెచ్ఆర్సీకి ఆమె విజ్ఞప్తి చేశారు.