విద్యార్థినిపై ఆటో డ్రైవర్ అత్యాచారం

 

పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో ఘోరం జరిగింది. ఇంటర్మీడియట్ చదువుతున్న ఓ విద్యార్థిని కాలేజీకి వెళ్ళడానికి ఆటో ఎక్కింది. అయితే ఆ ఆటో డ్రైవర్ ఆమెని కిడ్నాప్ చేసి అత్యాచారం చేశాడు. ఎంతో కష్టం మీద ఆటో డ్రైవర్ చెర నుంచి తప్పించుకున్న ఆ విద్యార్థిని పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఆ ఆటోడ్రైవర్ని అరెస్టు చేసి కేసు నమోదు చేశారు.