బొద్దింకల ఆందోళనతో మోడీ భయపడ్డారు.!
Published on: Sat Jul 25, 2026 8:16AM

కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఆందోళన మోడీలో భయాన్ని పెంచుతోందా? పరీక్షల ప్రక్రియలో పారదర్శకత పెంచేందుకు, అక్రమార్కులపై ఉక్కుపాదం మోపేందుకు ప్రస్తుతం ఉన్న చట్టాలను మరింత కఠినతరం చేస్తామంటూ గురువారం (జులై 24) అర్ధరాత్రి మోడీ విడుదల చేసిన వీడియోలో.. ఆయన ముఖంలో భయం స్పష్టంగా కనిపించిందా? అంటే ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ ఔననే అంటున్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేసిన ఈ వీడియో సందేశంపై ప్రముఖ నటుడు, సామాజిక విమర్శకుడు ప్రకాశ్ రాజ్ ప్రధాని ముఖంలో భయం ప్రస్ఫుటంగా కనిపించిందంటూ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
ప్రధాని వీడియో సందేశాన్ని రీపోస్టు చేస్తూ.. ప్రకాశ్ రాజ్. తాను ప్రధాని ముఖంలో భయాన్ని స్పష్టంగా చూశానని పేర్కొన్నారు. ప్రధాని భయపడ్డారు.. యువత, విద్యార్థుల ఉద్యమంతో ప్రధాని దిగిరాక తప్పలేదనీ, దేశ భవిష్యత్ కోసం కాక్రోచ్ జనతా పార్టీ పోరాటాన్ని ఆయన అభినందిస్తూ.. ఆ పోరాటం వల్లనే దేశ ప్రజలలో చైతన్యం వచ్చిందని పేర్కొన్నారు. విద్యార్థుల మహోద్యమం ముందు మోడీ మోకరిల్లక తప్పలేదనడానికి ఆయన విడుదల చేసిన వీడియోయే తిరుగులేని సాక్ష్యమని ప్రకాశ్ రాజ్ పేర్కొన్నారు.
Prakash Raj, PM Narendra Modi, NEET Paper Leak, Jantar Mantar Protests, Exam Reforms India


