TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

బొగ్గు గనుల కేటాయింపుల రద్దుకు కేంద్రప్రభుత్వం సిద్దం

Published on: Tue Sep 2, 2014 9:20AM

 

ఇటీవల సుప్రీం కోర్టు 1993 నుండి 2010సం.వరకు జరిగిన అన్నిబొగ్గు గనుల కేటాయింపులు అక్రమమయినవేనని ప్రకటించింది. వాటిపై సుప్రీం కోర్టు పంపిన నోటీసులపై మోడీ ప్రభుత్వం వెంటనే స్పందిస్తూ, తను కూడా కోర్టు అభిప్రాయంతో ఏకీభవిస్తున్నట్లు తెలిపడమే కాక, కోర్టు సూచించిన మొత్తం కేటాయింపులన్నిటినీ రద్దు చేసి వాటికి మళ్ళీ కొత్తగా వేలం వేసేందుకు సంసిద్దత వ్యక్తం చేయడం విశేషం. అయితే వాటిలో 40 బొగ్గు గనులపై ఆధారపడి నడుస్తున్న విద్యుత్ ప్రాజెక్టులను దృష్టిలో ఉంచుకొని, వాటి కేటాయింపులపై తగిన నిర్ణయం తీసుకోవలసిందిగా కోర్టుని కోరింది. బొగ్గు గనుల కేటాయింపుల ఒప్పందాలను అన్నిటినీ రద్దు చేసి, మళ్ళీ వేలం వేసేందుకు సంసిద్దత వ్యక్తం చేసిన కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టు సూచించినట్లు ఈ అక్రమ కేటాయింపులను విచారించేందుకు సుప్రీం కోర్టు రిటర్డ్ జడ్జీలతో కూడిన కమిటి ఏర్పాటును వ్యతిరేఖించడం చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. దాదాపు ఇరవై ఏళ్లుగా జాతి సంపదను పందికొక్కులా దోచుకొని తిన్న పెద్ద కంపెనీలు, బడా పారిశ్రామిక వేత్తలు వారితో కుమ్మక్కయిన రాజకీయ నేతలు, అధికారుల పట్ల ఉదాసీనత చూపడం అంటే ఈ అవినీతిని కొనసాగింపుకి అనుమతించినట్లే అవుతుంది. అందువలన వారందరిపై చట్టపరంగా కటిన చర్యలు తీసుకోవడమే కాక, వారు ఇంతకాలంగా కొల్లగొట్టిన జాతి సంపదను కక్కించడం కూడా అంతే అవసరం. అదేవిధంగా ఒకేసారి అన్ని అనుమతులు రద్దు చేసినట్లయితే, వాటిపై ఆధారపడి విద్యుత్ ఉత్పత్తి చేస్తున్న ప్రభుత్వ, ప్రైవేట్ విద్యుత్ సంస్థల ఉత్పత్తికి అంతరాయం కలగకుండా చూసుకోవడం కూడా చాలా ముఖ్యం.