"స్టేట్ ఆఫ్ ద ఇయర్" ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్‌కు ప్రభుత్వానికి మరో అరుదైన గౌరవం లభించింది. సీఎన్‌‌‌బీసీ టీవీ18 అందించే ఇండియా బిజినెస్‌ లీడర్‌ అవార్డుల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్‌ను ప్రతిష్టాత్మక స్టేట్ ఆఫ్ ది ఇయర్ పురస్కారానికి ఎంపిక చేసింది. అభివృద్ధి, టెక్నాలజీ వినియోగం, సమర్థ నాయకత్వం తదితర అంశాలను పరిగణలోనికి తీసుకుని ఈ అవార్డుకు ఎంపిక చేశారు. బ్యాంకింగ్, పారిశ్రామిక రంగాల జాతీయస్థాయి ప్రముఖులు సభ్యులుగా ఉండే ప్యానెల్ ఈ అవార్డుకు ఏపీని ఎంపిక చేసింది. ఈ ప్యానెల్‌లో ఎస్‌బీఐ సీఎండీ అరుంధతి భట్టాచార్య, హెచ్‌డీఎఫ్‌సీ సీఎండీ ఆదిత్యపురి, కేకేఆర్ సంస్థ సీఈవో సంజయ్‌నాయర్ తదితరులున్నారు. మార్చి 23న పురస్కారం అందుకునేందుకు స్వయంగా రావాల్సిందిగా ఏపీ సీఎం చంద్రబాబుకు అవార్డు కమిటీ ఆహ్వానం పంపింది.