TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

హైదరాబాద్ లో అపోలో నూతన ఆస్పత్రిని ప్రారంభించిన సీఎం రేవంత్

Published on: Thu Apr 30, 2026 10:09AM

అపోలో హాస్పిటల్స్ దేశంలో తన 76వ ఆసుపత్రిని ప్రారంభించింది. నివారణ సంరక్షణ, రోగి-కేంద్రీకృత చికిత్సకు సమాన ప్రాధాన్యత ఇచ్చే ఈ ఆస్పత్రికి    బుధవారం (ఏప్రిల్ 29)న  తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు.  తెలంగాణలో అపోలోకు ఐదవ ఆస్పత్రి.  

10 అంతస్తుల ఈ స్మార్ట్ ఆసుపత్రిని సమీకృత డిజిటల్ వ్యవస్థలు, అధునాతన ఐసియు సామర్థ్యాలు, అత్యవసర ప్రతిస్పందన, మౌలిక సదుపాయాలు,  బహుళ-ప్రత్యేక ఆరోగ్య సంరక్షణ సేవలతో అభివృద్ధి చేశారు.  

ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ..  అంతర్జాతీయ వైద్య పర్యాటక కేంద్రంగా హైదరాబాద్‌కు ఖ్యాతి పెరుగుతోందన్నారు. చికిత్స కోసం వచ్చే రోగులకు మద్దతుగా బలమైన ప్రపంచ అనుసంధానం అవసరమన్నారు  భారత ఆరోగ్య సంరక్షణలో ఉన్నత ప్రమాణాలను నెలకొల్పినందుకు ముఖ్యమంత్రి అపోలో ఆసుపత్రులను   అభినందించారు.

కార్పొరేట్ ఆసుపత్రులు సరసమైన ధరలకు సామాన్య ప్రజలకు నాణ్యమైన ఆరోగ్య సంరక్షణను ఎలా విజయవంతంగా అందించగలవో డాక్టర్ ప్రతాప్ సి. రెడ్డి చూపించారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా  డాక్టర్ ప్రతాప్ సి. రెడ్డి  అపోలో  సామాజిక సేవా కార్యక్రమాలలో భాగంగా, ప్రతి ఆదివారం నానక్‌రామ్‌గూడలోని 10,000 మంది నివాసితులకు ఉచిత ఆరోగ్య పరీక్షలను నిర్వహిస్తామని ప్రకటించారు.