సీఎం రమేష్ ఆమరణ దీక్ష 

 

కడప స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయడం సాధ్యం కాదని కేంద్రం అఫిడవిట్ ఇవ్వడం.. దీనిపై విమర్శలు, నిరసనలు వ్యక్తం అవ్వడం తెల్సిందే.. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న టీడీపీ, ఇప్పటికే బీజేపీ మీద ఘాటు విమర్శలు చేస్తుంది.. ఇక టీడీపీ నేత రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ ఒకడుగు ముందుకేసి ఆమరణ దీక్షకు సిద్ధమయ్యారు.. కడప స్టీల్ ప్లాంట్ సాధనే లక్ష్యంగా, ఈ నెల 20వ తేదీ నుండి కడప జిల్లా పరిషత్‌ ఆవరణంలో సీఎం రమేష్ ఆమరణ దీక్ష చేయాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది.. రాష్ట్ర ప్రయోజనాల కోసం సీఎం రమేష్ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.