నేను నేలపై పడుకుంటాను.. మమతా చిన్న ఇంట్లో నివసిస్తారు..


పెద్ద నోట్ల రద్దును పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మొదటి నుండి వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కేంద్ర నిర్ణయంపై, ప్రధాని మోడీపై విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. ఇందుకుగాను మమతా బెనర్జీపై కూడా పలువురు విమర్శలు చేస్తున్నారు. అయితే ఇప్పుడు దీదీ వైఖరిపై స్పందించిన  ప్రముఖ యోగా రాందేవ్ బాబా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నట్లు కనిపించినా వాస్తవానికి మమతా మనసులో కేంద్రం తీసుకున్నది మంచినిర్ణయమే అని ఉందని..కానీ, దాని అమలు విధానాన్ని మాత్రమే ఆమె వ్యతిరేకిస్తున్నట్లుగా అనిపిస్తోందని చెప్పారు. నల్లధనం దేశంపై చెడు ప్రభావాన్ని చూపుతుందనే విషయాన్ని మమత కూడా అంగీకరించిందని అన్నారు. మమతా చాలా సాధరణమైన జీవితం గడుపుతారని ప్రశంసించారు. ‘నేను నేలపై పడుకుంటాను. ఆమె చిన్న ఇంట్లో నివసిస్తారు. హవాయ్‌ చెప్పులు వేసుకుంటారు. ఆమె ఆర్థిక స్థితిగతుల గురించి ప్రత్యేకంగా ఏ ఒక్కరూ అనుమానించాల్సిన పనిలేదు.