కిరణ్ ఈటెల మధ్య వాగ్వివాదం..బాబు కౌంటర్

 

 

 

తెలంగాణ బిల్లుపై చర్చ సంధర్బంగా సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, ఈటెల రాజేందర్ మధ్య వాగ్వావాదం చోటుచేసుకుంది. తెలంగాణ అడ్వకేట్ జనరల్ పదవి తెలంగాణకు చెందిన వ్యక్తికి ఇవ్వలేదని ఈటెల ఆరోపించారు. దీనిపై సీఎం కిరణ్ స్పందిస్తూ...తెలంగాణ నుంచి సీఎం పదివి పొందిన వారు అడ్వకేట్ జనరల్ పదవి ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. పీవీ నరసింహారావును మీరు గెలిపిస్తారని నమ్మకం లేకనే మీము గెలిపించామని వ్యాఖ్యానించారు.

 

శాసనసభలో సీఎం కిరణ్ మాట్లాడుతూ పీవి ప్రస్తావన తేవడంతో... బాబు దానిపై స్పందించారు. పీవికి ఢిల్లీలో ఘాట్ ఎందుకు నిర్మించలేదని  ..కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు ప్రశ్నించడం లేదన్నారు. పీవి చనిపోతే కాంగ్రెస్ వాళ్ళు పార్టీ ఆఫీస్ కూడా తీసుకెళ్ళలేదన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉండి కూడా పీవి అంత్యక్రియలు సక్రమంగా చేయలేదన్నారు.పీవీని కాంగ్రెస్ హైకమాండ్ అడుగడుగా అవమానించిందన్నారు. పీవీకి జరిగిన అన్యాయాన్ని ఎండగట్టింది టీడీపీనే అని చంద్రబాబు అన్నారు.