మోడీ జపం చేస్తానన్న కేజ్రీవాల్...

 

పెద్ద నోట్లు రద్దు చేసినందుకు గాను ప్రధాని నరేంద్ర మోడీపై ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ మొదటి నుండి విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోసారి కేజ్రీవాల్ మోడీపై మండిపడ్డారు. తన దృష్టిలో నోట్ల రద్దు ఆర్థిక వ్యవస్థను సమూలంగా నాశనం చేస్తుందని..  తక్షణం ఈ నిర్ణయాన్ని విత్ డ్రా చేసుకుని గతంలో మాదిరిగానే లావాదేవీలకు అవకాశం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. డీమానిటైజేషన్ కారణంగా కార్మికులు, రైతులు, వ్యాపారులు, ప్రజలు తమ ఆదాయ మార్గాలను కోల్పోయారని, బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు పెద్ద నోట్ల రద్దు తరువాత దేశంలో అవినీతి పూర్తిగా అంతమైతే, తాను 'మోదీ మోదీ' అని మోదీ నామస్మరణ చేసేందుకు సిద్ధమని అన్నారు.