నోట్ల రద్దు గురించి ముందే తెలుసు..

 

నల్లధనాన్ని అరికట్టే దిశలో భాగంగా ప్రధాని మోడీ రూ.500, 1000 నోట్లు రద్దు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై ముఖ్యమంత్రి మరోసారి కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. పెద్ద నోట్ల రద్దు భారీ కుంభకోణమే అని అన్నారు. అంతేకాదు పెద్ద నోట్ల ర్దదు గురించి బీజేపీ, మిత్రులకు ముందే తెలుసని.. నోట్లు రద్దు కాకముందే బీజేపీ కీలక నేతల దగ్గర రూ.2వేల నోట్లు ఉన్నాయని ఆరోపించారు. పెద్దనోట్లు రద్దుతో బీజేపీ నేతలకు భారీ లబ్ధి చేకూరిందని, నల్లకుబేరులు డాలర్లను బ్లాక్ లో కొంటున్నారని..నల్లధనం ఎవరి దగ్గర ఉందో మోడీ సర్కార్ బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు.