కేజ్రీవాల్ ను కాల్చిపారేస్తా..

 

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు గతంలో బెదిరింపులు వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా మరోసారి బెదిరింపులు వచ్చినట్టు తెలుస్తోంది. కేజ్రీవాల్ ఢిల్లీలో అడుగుపెట్టిన వెంట‌నే ఆయ‌న‌ను కాల్చిపారేస్తామని గుర్తు తెలియ‌ని వ్య‌క్తి బెదిరింపులు చేశాడు. ప్రస్తుతం కేజ్రీవాల్ చండీగ‌ఢ్‌లో ప‌ర్యటిస్తున్నారు. పర్యటన ముగిసిన అనంతరం... ఆయన అక్క‌డి నుంచి బయలుదేరి ఢిల్లీ చేరుకోనున్నారు. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ ఢిల్లీలో అడుగుపెట్టిన వెంట‌నే ఆయ‌న‌ను కాల్చిపారేస్తామని ఢిల్లీ పోలీసు అత్యవసర విభాగానికి.. గుర్తు తెలియ‌ని వ్య‌క్తి  బెదిరింపు కాల్ వ‌చ్చింది. దీంతో అప్ర‌మ‌త్త‌మ‌యిన పోలీసులు కేజ్రీవాల్ కు భారీ భద్రతను ఏర్పాటు చేస్తున్నారు.