కేజ్రీవాల్ కు సుప్రీం చీవాట్లు...

 

ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఏ చిన్న విషయంలో కాస్త తేడా వచ్చినా కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూనే ఉంటారు. ఈ విషయంలో గతంలోనే సుప్రీంకోర్టు కేజ్రీవాల్ కు  అక్షింతలు పెట్టింది. ఇప్పుడు తాజాగా మరోసారి దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు చీవాట్లు పెట్టింది. ప్రతి విషయంలో కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేయడం సబబు కాదని.. సమస్యలపై ఇతరులను నిందించడం తగదని సూచించింది. ఢిల్లీలోని స్థానిక సంస్థలు తమ పనులను నిర్వహించుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం అవకాశం ఇవ్వాలని చెప్పింది. అత్యంత ప్రధానమైన పారిశుద్ధ్య నిర్వహణ కార్యక్రమాలను అడ్డుకోవద్దని చెప్పింది.