కొండపోచమ్మసాగర్‌ను ప్రారంభించనున్న సీఎం కేసీఆర్‌

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన కొండపోచమ్మ సాగర్ ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 29న కొండపోచమ్మ జలాశయాన్ని సీఎం కేసీఆర్‌ ప్రారంభించనున్నారు. 29న ఉదయం 11.30 గంటలకు సీఎం కేసీఆర్ చేతుల మీదుగా జలాశయంలోకి నీరు విడుదల చేయనున్నట్లు ఆర్థిక శాఖ మంత్రి హరీష్ ‌రావు తెలిపారు. ఈ సందర్భంగా కొండ పోచమ్మ ఆలయంలో చిన్నజీయర్‌ స్వామితో కలిసి సీఎం కేసీఆర్‌ హోమం నిర్వహించనున్నారని హరీష్‌ తెలిపారు. కాగా, కొండపోచమ్మ సాగర్ ద్వారా సీఎం కేసీఆర్ సొంత నియోజకవర్గమైన గజ్వేల్‌లో కాళేశ్వరం జలాలు పారనున్నాయి.