క్రమశిక్షణ లేని కానిస్టేబుళ్ళకి పోస్టింగ్

 

 cm kcr new plan, kcr Farmer Loans, kcr police

 

 

సీమాంధ్రుల మీద తన కడుపులో వున్న విషాన్ని కేసీఆర్ సందర్భం వచ్చినప్పుడల్లా కక్కుతూ వుంటారు. ఆయన తెలంగాణకు ముఖ్యమంత్రి అయినా తర్వాత కూడా అలా విషం కక్కడం మానలేదు. సీమాంధ్రులను గిల్లే పనులను ఆపలేదు. హైదరాబాద్‌లో ఏపీ ఎన్జీవోల సభలు జరిగిన సమయంలో ఆ సభల్లో దూరిపోయి తెలంగాణ నినాదాలు చేస్తూ క్రమశిక్షణ తప్పిన ఇద్దరు కానిస్టేబుళ్ళను కేసీఆర్ అక్కున చేర్చుకున్నారు. వారిద్దరి మీద విధించిన సస్పెన్షన్ ఎత్తివేస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వ అధినేత హోదాలో ప్రకటించారు. ఆ ఇద్దరు కానిస్టేబుళ్ళ పేర్లు శ్రీనివాస్, శ్రీశైలం. కేసీఆర్ వారిద్దరి మీద సస్పెన్షన్ ఎత్తివేయడంతో ఆగకుండా ఆగకుండా వారిద్దరిని సచివాలయంలోనే పోస్టింగ్ ఇవ్వాలని ఆదేశించారు. రైతుల రుణ మాఫీకి సంబంధించిన అంశంలో తెలంగాణ రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్న కేసీఆర్ జనం దృష్టిని అటువైపు నుంచి మళ్ళించడానికే ఈ ఇద్దరు కానిస్టేబుల్స్ మీద సస్పెన్షన్ ఎత్తివేసి, సచివాలయంలో పోస్టింగ్ ఇచ్చారని పరిశీలకులు భావిస్తున్నారు. క్రమశిక్షణ లేకుండా వ్యవహరించిన ఈ ఇద్దరు కానిస్టేబుల్స్ మీద సస్పెన్షన్ వేటు ఎత్తేయడం ఒక తప్పయితే, ఇలాంటి క్రమశిక్షణ లేనివాళ్ళని డైరెక్టుగా సచివాలయంలోకి తీసుకురావడం మరో పెద్ద తప్పు అని పరిశీలకులు అంటున్నారు.