TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

చండీయాగ మంటపంలో అగ్ని ప్రమాదం

Published on: Sun Dec 27, 2015 1:51PM

 

తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ ఎర్రవెల్లిలో నిర్వహిస్తున్న చండీయాగంలో చివరిరోజున చిన్న అపశ్రుతి జరిగింది. హోమ గుండంలో మంటలు ఒక్కసారిగా పైకి ఎగియడంతో యాగశాలకు మంటలు అంటుకొన్నాయి. దానితో లోపల ఉన్న ప్రజలు భయబ్రాంతులై బయటకు పరుగులు తీసారు. సరిగ్గా అదే సమయానికి రాష్ట్రపతి హెలికాఫ్టర్ లో ఆ ప్రాంతానికి చేరుకొన్నారు. కానీ పరిస్థితి సరిగ్గా లేకపోవడంతో రాష్ట్రపతి క్రిందకు దిగకుండానే వెనుతిరిగి వెళ్ళిపోయారు. యజ్ఞకుండంలో ఒకేసారి ఎక్కువ నెయ్యి పోయడం వలననే మంటలు పైకి ఎగసిపడినట్లు తెలుస్తోంది. తక్షణమే అగ్నిమాపక దళాలు అక్కడికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకువచ్చేయి. మళ్ళీ యాగం యధావిధిగా జరుగుతుంది. ఈరోజు సాయంత్రంతో యాగం పరిసమాప్తం అవుతుంది.