ఇదెక్కడి న్యాయం కేసీఆర్ బాబాయ్..

 

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సోదరుడి కూతురు రమ్యను పోలీసులు ఈ ఉదయం అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఉదయం గన్ పార్క్ వద్ద ఆమె ఎమ్మెల్యే బొడిగ శోభకు వ్యతిరేకంగా ధర్నాకు దిగగా పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఆమెను గాంధీనగర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ను ప్రశ్నించారు.  తన ఆస్తులపై దాడులు జరుగుతుంటే, అదే విషయాన్ని నలుగురికీ తెలియజెప్పేందుకు శాంతియుతంగా నిరసన తెలుపుతున్న తనను అరెస్ట్ చేయించడం ఎంత వరకూ సబబని ప్రశ్నించారు. ఎమ్మెల్యే బొడిగ శోభ అరాచకాలు పెరిగిపోయాయని, ఆమెను అరెస్ట్ చేసే వరకూ ఉద్యమిస్తానని చెప్పిన రమ్య, రాష్ట్రంలో ప్రజలకు, ప్రతిపక్షాలకు ఓ న్యాయం, ప్రజా ప్రతినిధులకు మరో న్యాయం జరుగుతోందని, ఇదెక్కడి న్యాయమని అడిగారు. మరి దీనిపై కేసీఆర్ ఎలా స్పందిస్తారో చూడాలి.