జయకు చికిత్స కొనసాగుతోంది.. పుకార్లు నమ్మొద్దు...

 

జయలలితకు ఇంకా చికిత్స కొనసాగుతుందని.. ఆమె ఇక లేరు అని తప్పుడు ప్రచారాలు జరుగుతున్నాయని అపోలో ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. తమిళనాడు ముఖ్యమంత్రి ఇక లేరు అని చెన్నైకు చెందిన పలు ఛానెళ్లలో ప్రచారాలు జరుగుతున్న నేపథ్యంలో దీనిపై స్పందించిన అపోలో జయ ఆరోగ్యంపై తప్పుడు ప్రచారం జరుగుతోందని... ప్రజలు ఎలాంటి వదంతులు నమ్మొద్దని విజ్ఞప్తి చేసింది.


ఇక మరోవైపు ఆస్పత్రి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కనీసం పార్టీకు సంబంధించిన కార్యకర్తలకు కూడా ఎలాంటి సమాచారం తెలియక పోవడంతో వస్తున్న వార్తలతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళనలు చేపట్టారు. అమ్మను చూపించాలని డిమాండ్ చేస్తూ గొడవకు దిగారు. దీంతో పోలీసులు లాఠీ ఛార్జ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.