జయలలిత వారసుడు ఖరారు..

 

చెన్నైలోని అపోలో ఆస్పత్రి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అమ్మ ఆరోగ్యం విషమంగా ఉందని..ఆమెకు ఎక్మో పద్దతి ద్వారా చికిత్స అందిస్తున్నామని అపోలో సిబ్బంది హెల్త్ బులెటిన్ విడుదల చేసిన నేపథ్యంలో అభిమానులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఆస్పత్రి వద్దకు అభిమానులు, పార్టీ నేతలు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ఇదిలా ఉండగా మరోపక్క అమ్మ వారసుడిపై చర్చలు జరుగుతున్నాయి. పార్టీ ఎమ్మెల్యేలందరూ సమావేశమై జయలలిత వారసుడిగా పన్నీరు సెల్వం పేరును ఖరారు చేశారు. ఎమ్మెల్యేల అభిప్రాయలను సేకరించి..ఏకాభిప్రాయంగా పన్నీరు సెల్వం పేరును ఖరారు చేశారు. అయితే అధికారింగా సాయంత్రం ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది.