వేలిముద్ర వేసిన జయలలిత..
posted on Oct 29, 2016 11:19AM
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత గతకొద్దికాలంగా చెన్నై అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. అయితే కొద్ది రోజుల్లో తమిళనాడులో ఉపఎన్నికలు జరగనున్న నేపథ్యంలో జయలలిత ఎన్నికల దరఖాస్తుపై వేలి ముద్ర పెట్టారు. ఈ ఏడాది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరిగిన నేపథ్యంలో కొన్ని ప్రాంతాల్లో పలు ఆరోపణల నేపథ్యంలో ఎన్నికలు రద్దు చేశారు. ఇప్పుడు ఆ నియోజక వర్గాల్లో ఎన్నికలకు గాను దరఖాస్తుపై వేలి ముద్ర పెట్టారు. జయ కుడి చేయికి ఇన్ఫెక్షన్ కావడం వల్ల ఆమె సంతకం చేయలేకపోయినట్లు అధికారులు తెలిపారు. తిరుపరంగుడ్రమ్ నియోజకవర్గం కోసం ఉప ఎన్నికలకు జరగనున్నాయి. దీనిలో భాగంగానే జయ తమ పార్టీ అభ్యర్థిని ప్రకటించేందుకు వేలి ముద్ర పెట్టాల్సి వచ్చింది. ఆ స్థానం నుంచి అన్నాడీఎంకే అభ్యర్థిగా ఏకే బోస్ పోటీపడుతున్నారు. అయితే ఆ అభ్యర్థి చేసే ఎన్నికల దరఖాస్తుకు పార్టీ అధినేత సంతకం అవసరం ఉటుంది. ఈ కారణంగా సీఎం జయ ఆ అప్లికేషన్పై వేలి ముద్ర పెట్టనట్లు అధికారులు తెలిపారు. మద్రాస్ మెడికల్ కాలేజీ ప్రొఫెసర్ ఆ సంతకాన్ని పరిశీలించి ఆమోదం తెలిపారు. మరి జయలలిత ఆరోగ్యం మెరుగుపడిందని.. కొద్ది రోజుల్లో డిశ్చార్జ్ కూడా అవుతుందని చెప్పి.. ఇప్పుడు వేలి ముద్ర వేయించడం ఏంటో అని పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.