త్వరలో ఇంటికి అమ్మ.. ఆనందంలో తమిళ తంబిలు

 

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత కు గత కొద్ది రోజులుగా చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నసంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఆమె పూర్తిగా కోలుకుంటున్నట్టు... త్వరలో డిశ్చార్జ్ అయ్యే అవకాశాలు ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. జయలలిత ఆరోగ్యం  మెరుగుపడిందని.. అంతేకాదు, అన్నీ సవ్యంగా జరిగితే, ఈ ఆదివారం ఆసుపత్రి నుంచి ఆమె డిశ్చార్జ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని.. ఈ విషయాన్ని స్వయంగా చెన్నైలోని అపోలో వైద్యులే వెల్లడించారు. దీంతో తమిళనాడులో పండుగ వాతావరణం నెలకొంది. దీపావళిని ఘనంగా నిర్వహించుకునేందుకు తంబిలు రెడీ అవుతున్నారు. కాగా గత నెల 22న తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ అపోలో ఆసుపత్రిలో జయ అడ్మిట్ అయ్యారు.