జయలలిత 10 రోజుల్లో డిశ్చార్జ్‌ అవుతారు..

 

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత గత నెల రోజుల నుండి చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమెను ఇప్పటివరకూ పలువురు రాజకీయ ప్రముఖులు పరామర్సించారు. ఇప్పుడు  ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పలువురు తెదేపా నేతలు జయలలితను పరామర్శించడానికి చెన్నై వెళ్లారు. కేంద్రమంత్రి సుజనాచౌదరి, ఎంపీలు మురళీ మోహన్‌, సీఎం రమేశ్‌ తదితరులు అపోలో ఆసుపత్రికి వెళ్లి జయను పరామర్శించారు. అనంతరం సుజనాచౌదరి మీడియాతో మాట్లాడుతూ.. జయలలిత ఆరోగ్యం 95శాతం మెరుగుపడిందని వైద్యులు తెలిపారని చెప్పారు. వైద్యుల పర్యవేక్షణలో ఆమెకు చికిత్స అవసరమని, 10 రోజుల్లో డిశ్చార్జ్‌ అవుతారని వైద్యులు చెప్పారని తెలిపారు. అశ్యర్యం ఏంటంటే.. ఎంత మంది వెళ్లినా ఆమెను చూడకుండానే వస్తున్నారు. అక్కడికి వెళ్లడం.. వైద్యులతో మాట్లాడటం ఇదే సరిపోతుంది.