జయలలిత హెల్త్.. మరో అప్ డేట్..

 

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత గత నెలరోజులుగా చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అమ్మ ఆరోగ్యం గురించి వైద్యులు రోజుకో ఆప్ డేట్ ఇస్తూనే ఉన్నారు. ఇప్పుడు తాజాగా మరో అప్ డేట్ ఇచ్చారు పార్టీ వర్గాలు. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత చాలావరకు స్పృహలోనే ఉంటున్నారని.. ఆస్పత్రిలో బెడ్ మీద లేచి కూర్చుంటున్నారని తెలిపారు. అయితే శ్వాసకోశ సమస్యల కారణంగా ఆమెకు కృత్రిమ శ్వాస మాత్రం అందించాల్సి వస్తోందని.. ఆమెకు ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉందని, దానికి చికిత్స చేస్తున్నామని వైద్యులు తెలిపారు. ఆమె మరన్నిరోజుల పాటు ఆస్పత్రిలోనే ఉండి చికిత్స పొందాల్సి ఉంటుందని, ఆ తర్వాత మాత్రమే ఊపిరి అందించే ట్యూబును ఉంచాలా తీసేయాలా అన్నది నిర్ణయించగలమని అన్నారు.