అమ్మకు షాక్.. శశికళకు ఊరట..

 

ఈ మధ్య అమ్మ సర్కార్ కు సుప్రీంకోర్టులో వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. రెండు రోజుల క్రితమే పరువు నష్టం కేసులో అమ్మకు సుప్రీం కోర్టు మొట్టికాయలు వేయగా ఇప్పుడు మరోసారి సుప్రీం చేతిలో ఎదురుదెబ్బ తగిలింది. అన్నాడీఎంకే నేత ఎంపీ శశికళను పార్టీ నుండి సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. ఆ తరువాత ఆమెపై పలు ఆరోపణలు కూడా వచ్చాయి. తన ఇంటిలో పనిచేసే పనిమనుషులపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆమె కోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారించిన సుప్రీంకోర్టు.. శశికళ పుష్ప దాఖలు చేసుకున్న యాంటిసిపేటరీ బెయిల్ పై నిర్ణయం తీసుకునే అధికారాన్ని మద్రాస్ హైకోర్టుకు చెందిన మదురై బెంచ్ కు అప్పగిస్తూ.. పుష్ప కుటుంబ సభ్యుల అరెస్ట్ పై ఆరు వారాల పాటు స్టే విదించింది.