ఆయన దారిలోనే నేనూ నడిచా.. చంద్రబాబు

 

ఏపీ ముఖ్యంత్రి చంద్రబాబు చైనా పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన అక్కడ పీవీ నరసింహారావు జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇండియాలో ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టింది ఆయనేనని.. ఆయన మార్గంలోనే తాను కూడా పయనించినట్టు తెలిపారు. పీవీ ఆర్థిక సంస్కరణలను తాను రాష్ట్రంలో కొనసాగించానని.. అప్పటివరకూ అమలవుతున్న లైసెన్స్ కోటా రాజ్ విధానానికి పీవీ చరమగీతం పాడారని కొనియాడారు. సరళీకృత ఆర్థిక విధానాలను ప్రవేశపెట్టి, పెట్టుబడుల గమ్యస్థానంగా ఇండియాను మార్చిన ఘనత పీవీ నరసింహారావుదేనని అన్నారు. కాగా ఏపీకి పెట్టుబడులు తీసుకురావడానికి చంద్రబాబు చైనాలో మూడు రోజులు పర్యటించనున్నారు.