జగన్ ను తిట్టినందుకు ర్యాంకులా..?

 

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సాధారణంగా.. మంత్రులు, అధికారుల పనితీరును బట్టి వారికి ర్యాంకులు ఇస్తారన్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు కూడా చంద్రబాబు ర్యాంకులు ఇవ్వనున్నారంట. అయితే ఈ ర్యాంకులు ఎందుకనుకుంటున్నారా..? వింటే మీరు కూడా అశ్యర్యపోవాల్సిందే. ఏపీ ప్రతిపక్ష నేత జగన్ ను ఎవరైతే ఘాటుగా విమర్శిస్తారో వారికి ర్యాంకింగ్స్ ప్రకటించనున్నారంట.

 

అయితే టీడీపీ నేతలు మాత్రం జగన్ పై ఘాటు వ్యాఖ్యలు చేయాలంటే ఎప్పుడూ ముందే ఉంటారు. అయితే అందరు నేతల సంగతేమో కాని ఈసారి మాత్రం.. ర్యాంకింగ్స్ ఇస్తే దేవినేని ఉమనే పస్టే ర్యాంకు కొడతారని అనుకుంటున్నారు. ఎందుకంటే గత కొంత కాలంగా జగన్ పై  విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఏ చిన్న విషయం దొరికినా జగన్ ను ఏకి పారేస్తున్నారు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. జగన్ విదేశీ పర్యటనలో ఉన్నాగానీ దేవినేని ఉమ మాత్రం జగన్‌పై మండిపడుతూనే వున్నారు. దీంతో ఈసారి దేవినేని ఉమకే ఆ అవకాశం దక్కే ఛాన్స్ ఉందని అనుకుంటున్నారు.

 

మొత్తానికి పని చేసినందుకు ర్యాంకులు ఇవ్వడం చూశాం కానీ.. ఇలా తిట్టినందుకు ర్యాంకులు ఇవ్వడం వెరైటీగానే ఉంది. మరి చూద్దాం.. జగన్ ను ఎవరు ఎక్కువగా తిట్టారో.. ఎవరికి ఫస్ట్ ర్యాంకు వస్తుందో..