మనవడి తలనీలాల కార్యక్రమంలో చంద్రబాబు

ఏపీ సీఎం చంద్రబాబు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణల ముద్దల మనవడు దేవాన్ష్ తలనీలాలు ఈరోజు తీయనున్నారు. చిత్తూరు జిల్లాలోని నారావారి పల్లెలో లోకేశ్ దేవాన్ష్ తలనీలాలు సమర్పించనున్నారు. ఈ కార్యక్రమంలో చంద్రబాబు కుటుంబసభ్యులు, బాలకృష్ణ కుటుంబసభ్యులు పాల్గొన్నారు. నాగాలమ్మ గుడి దగ్గర ప్రత్యేక పూజలు నిర్వహించి.. చంద్రబాబు శ్రీనాగలమ్మతల్లికి మొక్కులు తీర్చుకుంటున్నారు. కాగా చిత్తూరు జిల్లా నారావారి పల్లెలో చంద్రబాబు రెండు రోజుల పర్యటనకు అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు.