TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఏపీలో లా అండ్‌ ఆర్డర్‌ సమస్య తేవాలని వైసీపీ చూస్తోంది : సీఎం చంద్రబాబు

Published on: Mon Feb 2, 2026 2:59PM

 

ఏపీలో లా& ఆర్డర్ సమస్య తేవాలని వైసీపీ చూస్తోందని సీఎం చంద్రబాబు తెలిపారు. తాజా ఘటనలపై టీడీపీ  సీనియర్ నేతలు, మంత్రులు, రాష్ట్ర పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ రావుతో ముఖ్యమంత్రి  టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. టీటీడీ లడ్డూ వ్యవహారంలో దొరకిపోయిన వైసీపీ.. ఇష్యూ డైవర్ట్ చేయడానికి ప్లాన్ చేస్తోందని.. అందుకే ఆ పార్టీ నేతలు బూతు పురాణం ఎంచుకున్నారని ముఖ్యమంత్రి  తెలిపారు. టీడీపీని రెచ్చగొట్టి అలజడి సృష్టించాలని చూస్తోంది. ఆ ట్రాప్‌లో పార్టీ నేతలు, కార్యకర్తలు పడొద్దని చంద్రబాబు సూచించారు.

అన్ని వర్గాలు సంతోషంగా ఉన్నారని..కూటమి ప్రభుత్వం 20 నెలలుగా పాలనలో అభివృద్ధి జరుగుతోందని.. ఏపీకి భారీగా పెట్టుబడులు వస్తున్నాయని మంత్రులతో సీఎం అన్నారు. రెండు రోజులుగా జరిగిన సంఘటనపై అప్రమత్తంగా ఉండాలని. వైసీపీ ఇలా చేయడం వల్లే 2024లో ప్రజలు వారికి అధికారం లేకుండా ఆయన చేశారని ఈ సందర్భంగా గుర్తుచేశారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి వైసీపీ నేతలు ఓర్వలేకే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ముఖ్యమంత్రి అన్నారు.