అసెంబ్లీలో చంద్రబాబు ప్రసంగం ప్రారంభం

 

ఆంధ్రప్రదేశ్ రాజధానిని ప్రకటించడానికి చంద్రబాబు సిద్ధమయ్యారు. గురువారం నాడు ఆయన అసెంబ్లీలో తన ప్రసంగాన్ని ప్రారంభించారు. అయితే గురువారం ఉదయం నుంచి రాజధాని ప్రకటనకు ముందే చర్చ జరగాలని పట్టుబడుతూ వచ్చిన వైసీపీ సభ్యులు చంద్రబాబు మాట్లాడుతూ వుండగా నినాదాలు చేస్తూ గందరగోళం సృష్టించారు. ఈ సందర్భంగా చంద్రబాబు చర్చ కావాలన్నారు కదా.. ప్రశాంతంగా వుండి చర్చించండి అని చెప్పినా వైసీపీ సభ్యులు శాంతించలేదు. అయితే ఇలాంటి గందరగోళ వాతావరణంలో మాట్లాడనని, స్పీకర్ సభను అదుపులో పెట్టిన తర్వాతే తాను మాట్లాడతానని ముఖ్యమంత్రి కూర్చున్నారు. స్పీకర్ సభను అదుపు చేయాలని ప్రయత్నిస్తున్నా వైసీపీ సభ్యులు తగ్గడం లేదు.