ఈ నెల 21 నుంచి తెలంగాణలో పదో తరగతి పరీక్షలు
Published on: Fri Mar 7, 2025 1:14PM
ఈ నెల 21వ తేదీ నుంచి తెలంగాణలో పదో తరగతి పరీక్షలు ప్రారంభమవుతున్నాయి. ఏప్రిల్ 2వ తేదీ వరకు పరీక్షలు కొనసాగనున్నాయి. ప్రతి రోజు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్షలు జరుగనున్నాయి. అన్ని పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు కానుంది.
విద్యార్థులు తమ హాల్ టికెట్లను వెబ్ సైట్ నుంచి కూడా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. శుక్రవారం నుంచి హాల్ టికెట్లను వెబ్ సైట్ ద్వారా తీసుకోవచ్చు. bse.telangana.gov.in లింక్ పై క్లిక్ చేసి... పేరు, పుట్టినరోజు వివరాలను ఎంటర్ చేసి హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకోవచ్చని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. ఫీజులు కట్టకుండా హాల్ టికెట్లు పొందే అవకాశం లేదని వివిధ ప్రయివేటు స్కూలు యాజమాన్యాలు చెబుతున్నాయి.


