కొలిక్కి వచ్చిన సివిల్ సర్వీసెస్ విభజన

 

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్ అధికారుల విభజన ఒక కొలిక్కివచ్చింది. ఈ అంశం మీద ప్రత్యూష్ సిన్హా కమిటీ శనివారం సమావేశం అయ్యింది. లాటరీ ప్రక్రియ ద్వారా రోస్టర్ విధానంతో అధికారుల కేటాయింపు పూర్తి చేసింది. లాటరీలో మొదట తెలంగాణ రాష్ట్రం పేరు రావడంతో రోస్టర్ విధానాన్ని తెలంగాణ నుంచే అమలు చేశారు. రెండు రాష్ట్రాలకు ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్ పోస్టులను లాటరీ ద్వారా నిర్ణయించారు. ఈ సందర్భంగా తెలంగాణకు ఐఏఎస్-163, ఐపీఎస్-112, ఐఎఫ్‌ఎస్-65 మంది అధికారులను కేటాయించారు. ఆంధ్రప్రదేశ్కు ఐఏఎస్-211, ఐపీఎస్-144, ఐఎఫ్‌ఎస్-85 మంది అధికారులను కేటాయించారు. వచ్చే శనివారానికల్లా అధికారుల కేటాయింపు పూర్తవుతుంది. అధికారుల విభజన 13:10 నిష్ఫత్తిలో జరుతుతుంది.