TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

పేకాట రాయుళ్ల పరారీ కేసులో సిఐ, ఎస్సై సస్పెన్షన్

Published on: Fri Aug 24, 2012 12:01PM

CI SUSPENTION, si suspention, playing cards, farm hous, holiday inn, culprits arrest, constables suspend, departmental Enquiry, accused escape,   పేకాటరాయుళ్ల పరారీ కేసులో నందిగామ సీఐ నాదెండ్ల మురళీకృష్ణ, కంచికిచర్ల ఎస్సై శివశంకర్ లను ఏలూరు రేంజ్  డిఐజి సూర్యప్రకాశరావు సస్పెండ్ చేశారు. రెండునెలల క్రితం కంచికిచర్ల సమీపంలోని ఉమా హాలిడే ఇన్ పై దాడిచేసిన  పోలీసులు 44మంది పేకాట రాయుళ్లను అరెస్ట్ చేశారు. మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి తీసుకొస్తుండగా 14 మంది నిందితులు పరారుకావడం కలకలం రేపింది. ఎస్పీతో విచారణ జరిపించి పదిమంది కానిస్టేబుళ్లను సస్పెండ్ చేశారు. పెద్దఎత్తున నిరసనలు వెల్లువెత్తడంతో ఆ ఉత్తర్వుల అమలుని నిలిపేశారు. ఈ ఘటనకు సీఐ, ఎస్సై లను బాధ్యులుగా భావిస్తూ ఇద్దరిపై సస్పెన్షన్ వేటువేశారు.