చెవిలో పూలతో శివప్రసాద్ నిరసన...
posted on Feb 16, 2018 11:58AM
ఏపీకి ఇచ్చిన హామీలను కేంద్ర ప్రభుత్వం నెరవేర్చకపోవడంపై గత కొద్దికాలంగా టీడీపీ నేతలు నిరసన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇక టీడీపీ చిత్తూరు ఎంపీ శివప్రసాద్ కూడా విచిత్ర వేషదారణలు వేస్తూ.. రకరకాల పద్దతుల్లో వినూత్నంగా నిరసనలు తెలుపుతారన్న సంగతి తెలిసిందే కదా. ఈ నేపథ్యంలోనే ఆయన ఈరోజు చెవిలో పువ్వు పెట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. తిరుపతిలోని తారకరామ స్టేడియానికి వచ్చిన నరేంద్రమోదీ ఏపీకి పలు హామీలు గుప్పించిన విషయాన్ని శివప్రసాద్ ప్రస్తావిస్తూ.... ఇదే స్టేడియం వద్ద శివప్రసాద్ తన చెవిలో పువ్వు పెట్టుకుని నిరసన తెలిపారు. ఏపీకి ఇచ్చిన హామీలను మోదీ పట్టించుకోవడం లేదని, హామీలు అమలు చేయకపోతే పుట్టగతులుండవంటూ ఆయన మండిపడ్డారు.